Sunday, 2 March 2014

Rushulu.....Raja Rushis & Brahma Rushis



ఋషులు మూడు రకాలుగా ఉంటారు. రాజులు ఋషులైతే రాజఋషులు అని అనబడతారు. అలాగనే  బ్రహ్మఋషులున్నారు.
          విశ్వామిత్రునికి బ్రహ్మఋషిగా పిలవబడాలని ఎంతో కోరిక ఉండేది. దానికొరకు ఆయన తపస్సు చేసారు. ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ఋషి అని పిలిచాడు. దానితో సంతృప్తినొందక ఘోరతపస్సు చేస్తే, బ్రహ్మ ప్రత్యక్షమై రాజఋషి అని నామకరణం చేసారు. సంతృప్తి పొందని విశ్వామిత్రుడు మరింత ఘోర తపస్సునాచరించాడు. బ్రహ్మచే బ్రహ్మఋషి అని అనిపించుకోవాలనుకున్నారు.
          కాని బ్రహ్మదేవులు విశ్వామిత్రుని ఓర్పును పరిశీలించగోరి తరచుగా ప్రశ్నలు వేసాడు. దానితో విశ్వామిత్రులకు ఓర్పు నశించి, కోపోద్రికులై బ్రహ్మఋషి పట్టాన్ని పొందలేకపోయారు. విషయం అర్ధం చేసుకొని, విశ్వామిత్రులు తన కోప-తాపాలను తగ్గించుకొని ఘోర తపస్సుచేసి చివరకు బ్రహ్మఋషి అని అనిపించుకున్నారు! దీనితోనూ సంతృప్తిపొందక వశిష్ఠమునిచే బ్రహ్మఋషి అని పిలిపించుకోవాలని ఆరాటం పొందారు. ఎలాగైతేనేమి వశిష్ఠులవారు ఆయనని బ్రహ్మఋషి అని పిలువగా దానితో సంతృప్తి చెందారు.
          అందువలన, పట్టువిడువక తాను నమ్మిన దానిని పొందేవరకు ప్రయత్నిస్తే తప్ప అది దొరకదని తెలుస్తుంది. ఈ విధంగా బ్రహ్మఋషి అవటం వలననే ఆయనకు గాయత్రీమంత్రం ఉపదేశింపబడింది. ఋషులు కూడా వస్తువిషయాలకు లోబడతారని మనకందరికీ తెలుస్తున్నాది. విశ్వామిత్రులవారు స్త్రీవ్యామోహంలో పడి శకుంతలకు తండ్రి అయ్యారని మనకు తెలుసు. అందువలన మనమందరమూ ఎంతో జాగ్రతతో వ్యవహరించాలి. ఋషులే తప్పులుచేయగా మనమెంత?
          ఋషులకు తపోశక్తులున్నాయని మనకందరికీ తెలుసు. ఒకప్పుడు ఇద్దరు ఋషుల మధ్య ఎవరు గొప్పవారో అన్న విషయంపై పోటీ జరిగింది. తడిసిన మానుని అగ్నికి ఆహుతి చేయటమే పందెం. ఒక ఋషి మాను నుంచి, తన తపోశక్తితో, పొగవచ్చేలాచేసారు, రెండో ఋషి దానిని నిలువునా కాల్చి బూడిద చేస్తాడు. ఇది ఎందువలన సంభవించింది. తపో శక్తితో మాత్రమే!. తపస్సు అంటే ఏమిటి? పూజ్య గురుదేవ్ చెబుతారు...   
          ఈ ఋషుల పరంపర నుంచే మనకు ఈ నాడు వేదము, దానిని ఏ విధంగా ఆచరించాలి, అనుకరించాలి అనేవి తెలిసాయి. పతంజలి ఋషి ద్వార పాతంజల యోగసూత్రములు, వేదవ్యాసుల ద్వార భారతము, భగవద్గీత, వాల్మీకి ఋషి ద్వారా రామాయణము ను పొందాము. మనమందరమూ మూడు రకాల ఋణాలతో పుట్టామని పురాణం చెబుతున్నది. అందులో ఒక ఋణం ఋషిఋణం. దీనిని బట్టి మనము ఋషులకు ఎంత ఋణపడి ఉన్నామో తెలుస్తున్నది.... వారికి వారివారి జన్మదినమున పూజలు చేయటము, వారిచ్చిన వేదాంతమును ప్రతిరోజు స్వాధ్యాయనము చేయటము, దానిలోని సారాంశములను ఆవగతం చేసుకొని మన జీవితాన్ని సార్ధకత్వము చేసుకోవటం తోనే...

Saturday, 25 January 2014

Kanuma ....the festival of cattle!


Cattle, specifically cows have a good representational situation in the Hindu society. Kanuma is the major festival for considering the importance of these animals in the nourishment and development of the society. Obviously, Kanuma Panduga is basically known as Kanuma, is an event which is very intimate to the hearts of farmers because it is the authorised day for especially praying and showcasing their cattle with honor. Cattles are the symbolic indication of sign of prosperity in many agrarian societies apart from the utilitarian features of tilling and production of milk which they serve and give respectively.
          Kanuma forms part of the three day event called Sankranti festival, each and every day having its very own importance. Kanuma falls on the third day of  Pongal (Tamil and Malayalam) and is generally known as Mattu Pongal in Southern India and in Andhra it is called as Mukkanuma.
         Union of families take place during the Sankranti event and specifically, sons-in-law holiday with their wife’s families. Subsequent to the beginning warm up with the bonfire of  Bhogi ,the first day of Sankranti, which is followed by new dresses and delicious meals on the second day of Sankranti. Kanuma is the day for showcasing the gaming and betting talents. Duly the demonstration starts with cattle.
         The most eye-catching feature of Kanuma is adorning the most excellent bulls and taking them for procession in the streets. Special Food is made and fed to the cattle on this day

Friday, 17 January 2014

Udagasamthi



ఉదకశాంతి అనేది వేదమంత్రాలతో ఆచరించే ఒక ప్రక్రియ. మంత్ర జలాలతో చేసే శాంతి కాబట్టి దీన్ని ఉదకశాంతి అంటారు. దీన్ని ఉపనయనం, వివాహం, స్నాతకం మున్నగు సంస్కారలోను, షష్టిపూర్తి, సహస్రచంద్ర దర్శనోత్సవం, ఇంకా పీడాఉత్పాత ఉపశమనానికి, ఆయుష్షు, అరోగ్యం, ఐశ్వర్యం కోరుకునే వారు ఆచరించాలని శ్రీ బోధాయన మహర్షి చెప్పారు. నాలుగు దిక్కుల్లో ఉదకశాంతి జపం ఆచరించేందుకు నలుగురు స్వాముల్ని అహ్వానించి, శుబ్రపరచిన స్థలంలో ముగ్గువేసి, స్థండిలాన్ని ఏర్పాటు చేస్తారు పురోహితులు. స్థండిలం అంటే పూర్ణకుంభాన్ని ఉంచడానికి నూతన వస్త్రంపై వడ్లు,నువ్వులు, బియ్యం పోసి ఏర్పాటు చేసిన వేదిక. ముందు విశ్వక్సేనుడు లేదా వినాయక పూజ తరువాత స్థండిలంలపై పూర్ణకలశాన్ని ఏర్పాటు చేసి, నాలుగు వేదాల్లోని వివిధ మంత్రాలు, ప్రక్రియలతో ఉదకశాంతిని పూర్తిచేస్తారు. ఆ మంత్ర జలాన్ని తీర్ధంగా ఇస్తారు. అందరిపైనా సంప్రొక్షించి అశీర్వదిస్తారు.

Thursday, 16 January 2014

Redefine Values


About a hundred years ago, a man looked at the morning newspaper and to his surprise and horror, read his name in the obituary column. The news papers had reported the death of the wrong person by mistake. His first response was shock. Am I here or there? When he regained his composure, his second thought was to find out what people had said about him. The obituary read, “Dynamite King Dies.” And also “He was the merchant of death.” This man was the inventor of dynamite and when he read the words “merchant of death,” he asked himself a question, “Is this how I am going to be remembered?” He got in tough with his feelings and decided that this was not the way he wanted to be remembered. From that day on, he started working towards peace. His name was Alfred Nobel and he is remembered today by the great Nobel Prize.
            Just as Alfred Nobel got in touch with his feelings and redefined his values, we should step back and do the same

Tuesday, 14 January 2014

Saccidanamdam



సచ్చిదానందం
         తెలుసుకున్నవి తెలుసుకున్నట్లు లౌకిక సత్యాలు బయటపెడితే అందరూ వాటిని అవగాహన చేసుకోగలరా? ఆధ్యాత్మిక సత్యాలు హృదయపరమైనవి. బయటపెట్టినా సులువుగా అర్థం కానివి. అందుకే  ఒక సత్యాన్వేషి ఓ విషయం చెప్పినప్పుడు, చాలా మంది అజ్ఞానులు వేరొక విషయంగా అర్థం చేసుకుని పొరపడే అవకాశం ఉంది.
         చూపు లేనివాడికి గంటల తరబడి ఏనుగు గురించి ఎన్ని వివరణలు ఇచ్చినా, అతడి అవగాహనకు ఏనుగు రాదు. మరేదో జంతువు రావచ్చు.
         అతడికి కావలసినది మొదట చూపు. చూపు ఇస్తే, ఏ వివరణలు, వర్ణనలు లేకుండా నేరుగా అతడు ఏనుగును చూడగలడు.
         దర్శింపజేసేదే జ్ఞానం. దర్శనీయమైనదే జ్ఞానం. జ్ఞానం అనుభూతిలోకి రావాలంటే అంతర్నేత్రం కావాలి. మహానుభావులు మనకు దర్శనం ఇస్తారు.  దానితో మన అజ్ఞానం పటాపంచలవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా సిద్థాంతపరంగా ఆత్మజ్ఞానం కూడా ఒక శాస్త్రంగానే ఉండిపోతుంది. అనుభవంలోకి రావాలంటే ప్రేమపూర్వకమైన హృదయం ఉండాలి. సత్యదర్శనం చెయ్యగలిగే అంతర్దృష్టి కావాలి.
         తెలుసుకున్నది చెప్పాలనే తహతహ ఉంటుంది. శాస్త్రజ్ఞులు తాము కనుక్కున్న విషయాలను వీధుల్లోకి పరుగులు తీసి యురేకా యురేకా అని అరిచి మరీ చెప్పారు. యోగ రహస్యాలను తెలుసుకున్న యోగి అంతకంటే వెయ్యి రెట్లు గట్టిగా బయటకు ప్రకటించగలడు. కాని, ఎంతమంది వాటిని అందుకోగలరు?
         సత్యం దర్శించినవాళ్లు, తపస్సు ఫలించినవాళ్లు, ఉత్తమ యోగులుగా మారినవాళ్లు మౌనం వహించటానికి కారణం ఇదే. తెలుసుకున్నది చెబితే అర్థం చేసుకుని, అంగీకరించే ప్రపంచం వాళ్ల ముందు లేదు. వాళ్లు ప్రపంచాన్ని దాటి వెళ్లి పోయారు. మనసును అధిగమించారు. ఇక ఎప్పటికీ అజ్ఞానులతో కలవరు. కలవాల్సిన అవసరం లేదు. భౌతిక రూపాలతో, బయటకు సాధారణ వ్యక్తుల్లా వాళ్లు కనిపిస్తారు. కాని, వాళ్లు మానవులు కారు. వాళ్లకు చావు పుట్టుకలతో సంబంధం లేదు. అజ్ఞానులు పడే బాధలతో అసలు సంబంధం లేదు. వాళ్లది నిత్య నిరంజన పరమానంద స్థితి. ఆ స్థితి నుంచి వాళ్లు దిగిరారు. వాళ్లకు భగవంతుడు స్నేహితుడు. ఒకరకంగా చెప్పాలంటే, వాళ్లు .. నడిచే దైవాలు!
         ఇలా భగవంతుణ్ని తెలుసుకున్నవాళ్లు, లోకానికి దూరమైపోతే అజ్ఞానులను ఉద్ధరించేవారు ఎవరనే సందేహం కలగవచ్చు. ఎవరికి వాళ్లు స్వయంగా తెలుసుకుని అనుభవించే అపరోక్ష అనుభూతే భగవంతుడు. ఆయనను గ్రహించడానికి కొంత సహాయం అయితే ఏదో రూపంలో లభించవచ్చు కాని, చూడాల్సింది మనమే. అందులో లేశమాత్రమైనా సందేహం లేదు.
         ఇందులో ఇంత సంక్లిష్టత ఉన్నప్పుడు, దైవం నాకు లభించాడని చెప్పినవాడి మాటకు ప్రమాణం ఏమిటి? అతడు దైవ సాక్షాత్కారం పొందాడని ఎలా తెలుస్తుంది? ముఖం చూస్తే తేజస్సు కనిపిస్తుంది కాని, తేజస్సే పరమ ప్రమాణంగా  తీసుకోగలమా?
         అందుకే భగవద్గీత కొన్ని లక్షణాలు చెప్పింది. అతడికి స్థితప్రజ్ఞుడు అని పేరు పెట్టింది. భూతదయ కలిగి ఉంటాడంది. మాన అవమానాలకు, శీతోష్ణ సుఖదుఃఖాలకు అతీతంగా ఉంటాడని చెప్పింది. ప్రేమ స్వరూపుడై ఉంటాడని చెప్పింది. కోరికలు లేనివాడై వైరాగ్యం అనే స్వర్గంలో మునిగి తేలుతుంటాడని చెప్పింది. కామ, క్రోధాదులని జయించి ఉంటాడని చెప్పింది. ఈశ్వర ప్రణిధానంతో నిత్యం భక్తి అనే గంధం పూసుకొని ఉంటాడని చెప్పింది.
         ఇవి చాలు- ఆ మహానుభావుణ్ని పట్టుకోవడానికి. ఇందులో ఏ ఒక్కటీ ఆత్మదర్శనం లేకుండా రాదు. వచ్చినా ఉండదు. వీటిని నటించలేరు. వీటితో ఆడుకోవడానికి కపటులు ప్రయత్నిస్తే అభాసుపాలవుతారు. చివరికి అధోగతికి చేరుకుంటారు.
         తెల్లరంగు వేసుకుని కాకి హంసలా విహరిస్తే, వానాకాలంలో ఏమవుతుంది? బటుడు నాటకంలో రాజు పాత్ర వేసినంత మాత్రాన అతడు ధనవంతుడై పోతాడా? గులాబి పరిమళాన్ని కాగితం పూలు ఇస్తాయా?
         ఒక మానవ దేహంలో దైవం ప్రకటితమైనప్పుడు సత్యం, చైతన్యం, ఆనందం అన్ని కోణాల్లో వెల్లివిరుస్తాయి. సచ్చిదానందం అంటే ఏమిటో చిన్న బాలుడు కూడా ఆ సన్నిధిలో అనుభవించగలుగుతాడు. అదే, ఆధ్యాత్మిక వివేకోదయం!
*ఈ వ్యాసం ఈనాడు దినపత్రికలోని అంతర్యామి భాగం నుండి గ్రహించబడినది.